Primary Education in different countries: పాఠ‌శాల విద్య ఒక్కో దేశంలో ఒక్కోలా! 1 y ago

featured-image

మ‌నిషి జీవితంలో విద్య ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. నేటి బాల‌ల భ‌విష్య‌త్తును నిర్ణ‌యించేది పాఠ‌శాల విద్యే. అందుక‌నే ప్ర‌భుత్వాలు అక్ష‌రాస్య‌త‌ను పెంచ‌డం కోసం ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అయినా ఆశించిన ఫ‌లితాలు రావ‌ట్లేద‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో ఎప్ప‌టినుంచో విద్యా వ్య‌వ‌స్థ‌లో మార్పులు తీసుకురావాల‌ని డిమాండ్ ఉంది. దీంతో కేంద్ర‌ ప్ర‌భుత్వం దీనిపై ఓ నిర్ణ‌యం తీసుకొని నూత‌న విద్యా విధానం-2020ని సిద్దం చేసిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టి వ‌ర‌కు 10+2+3 గా ఉన్న విద్యా వ్య‌వ‌స్ధ ఇప్పుడు 5+3+3+4 గా ఉండ‌నుంది. ఈ నూత‌న విద్యా విధానంపై మ‌రింత చ‌ర్చ జ‌ర‌గాల్సి ఉన్నా, క‌రోనా, లాక్‌డౌన్ త‌ద‌నంత‌ర ప‌రిణామాల‌తో ఈ విష‌యం కాస్త అట‌కెక్కింది. మ‌న‌దేశంలో పాఠ‌శాల విద్య‌గురించి స‌రే.. మ‌రి ఇత‌ర దేశాల్లో విద్య వ్య‌వ‌స్థ ఎలా ఉంది?  విద్యార్ధులు ఎలా చ‌దువుకుంటున్నారు? ఓ సారి గ‌మ‌నిస్తే....


జ‌పాన్‌

జ‌పాన్‌.... ఆధునిక దేశం. అత్య‌ధిక అక్ష‌రాస్య‌త ఉన్న దేశాల్లో ముందు వ‌రుస‌లో ఉంటుంది. అక్క‌డ ప‌దేళ్ల వ‌ర‌కు విద్యార్ధుల‌కు చిన్న చిన్న టెస్టులు త‌ప్ప‌... వార్షిక ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌రు. చిన్న‌త‌నంలోనే పాఠాల‌తోపాటు ఎదుటివాళ్ల‌తో ఎలా ప్ర‌వ‌ర్తించాలి?  స్వీయ‌ నియంత్ర‌ణ‌లో ఉండ‌టం ఎలా?  కొన్ని విష‌యాల్లో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌డం ఎలా?  వంటి విష‌యాల‌ను నేర్పిస్తారు. అక్క‌డి పాఠ‌శాల‌ల్లో విద్యార్ధుల కోసం కాప‌లాదారులు, సంర‌క్ష‌కులు, ఆయాల‌ను నియ‌మించ‌రు. విద్యార్ధులే బృందాలుగా ఏర్ప‌డి పాఠ‌శాల‌ను ప‌రిశుభ్రంగా ఉండేలా చూసుకుంటారు. ఈ విధంగా చేయ‌డం వ‌ల్ల విద్యార్ధులు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటూ శుభ్ర‌త‌ను పాటించ‌డం నేర్చుకుంటారు. విద్యార్ధులు, ఉపాధ్యాయులు క‌లిసే భోజ‌నం చేస్తారు. దీంతో వారిమ‌ధ్య బంధం మ‌రింత బ‌ల‌ప‌డుతుంది. వారానికి ఐదు రోజులే ప‌నిదినాలు. పాఠ‌శాల ముగిసిన త‌ర్వాత‌, వారాంతంలోనూ విద్యార్ర‌దులు ప్రైవేట్ శిక్ష‌ణ త‌ర‌గ‌తుల‌కు హాజ‌ర‌వుతుంటారు. విద్యార్ధుల భ‌విష్య‌త్తుకు అవ‌స‌ర‌మ‌య్యే పాఠాల‌తోపాటు జ‌ప‌నీస్ కాలీగ్ర‌ఫీ, సాహిత్యాన్ని త‌ప్ప‌క బోధిస్తారు. రెండు లేదా మూడూ సెమిస్ట‌ర్ల‌తో, 6+3+3 త‌ర‌హాలో పాఠ‌శాల విద్య న‌డుస్తుంది.


ఫ్రాన్స్‌

ఇత‌ర దేశాల‌తో పోలిస్తే పాఠ‌శాల ప‌నిదినాలు అతి త‌క్కువ ఉన్న దేశం ఫ్రాన్స్‌. ఇక్క‌డ స్కూల్స్ వారంలో నాలుగున్న‌ర రోజులే ప‌నిచేస్తాయి. బుధ‌వారం రోజున పాఠ‌శాల‌లు ఒంటిపూట కాగా, శ‌ని, ఆదివారాలు సెల‌వు. విద్యార్ధుల భోజ‌న స‌మ‌యం గంట‌న్న‌ర నుంచి రెండు గంట‌ల వ‌ర‌కు ఉంటుంది. పెద్ద‌గా ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చ‌లేని విద్యార్ధుల‌కు ప్ర‌త్యేకంగా త‌ర‌గ‌తి ఏర్పాటు చేసి, వారిపై మ‌రింత దృష్టి పెడ‌తారు. 15 ఏళ్ల వ‌య‌సులో మ‌న‌వ‌ద్ద జ‌రిగే ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లాగే అక్క‌డ కూడా బాకుల్యురేట్ ప‌రీక్ష రాయ‌వ‌ల‌సి ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణ‌త సాధిస్తేనే సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ పూర్తి చేసిన‌ట్లు.


జ‌ర్మ‌నీ

జ‌ర్మ‌నీ పాఠ‌శాల విద్య కాస్త భిన్నంగా ఉంటుంది. ఇక్క‌డ విద్యార్ధులు 1 నుంచి 4వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో చ‌దువుకుంటారు. ఆ త‌ర్వాత చ‌దువులో వారి ప్ర‌తిభ‌ను బ‌ట్టి హ‌ప్ట్ స్కూల్‌, రియ‌ల్ స్కూల్‌, జిమ్నాసియ‌మ్ అనే మూడు వేర్వేరు పాఠ‌శాల‌ల్లో చేర్చుతారు. ఏ పాఠ‌శాల‌లో చ‌దివినా కూడా క‌నీసం తొమ్మిదేళ్ల విద్య‌ను పూర్తి చేసుకోవాల్సిందే. వీటితోపాటు పార్ట్‌టైం స్కూల్స్ ని కూడా నిర్వ‌హిస్తారు. ఇక్క‌డ చ‌దువు పూర్తి చేసుకున్న‌వారు నేరుగా ఉద్యోగాల్లో చేర‌వ‌చ్చు. ఈ దేశంలో స్కూల్స్ ఉద‌యం 7.30 నుంచి 8.15 గంట‌ల మ‌ధ్య ప్రారంభ‌మై, మ‌ధ్యాహ్నం 12 నుంచి 1.30 గంట‌ల మ‌ధ్య‌న ముగుస్తాయి. జ‌ర్మ‌నీ విద్యార్ధుల‌పై హోంవ‌ర్క్‌, ఇత‌ర ఎక్స్‌ట్రా క‌రిక్యుల‌ర్ యాక్టివిటీస్ అంటూ అధిక భారం ప‌డుతుంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పాఠ‌శాల యాజ‌మాన్యాలు ప‌ని వేళ‌ల‌ను మ‌రింత పొడిగిస్తూ ఉంటాయి.


ద‌క్షిణ కొరియా

ఇక్కడ‌ పాఠ‌శాల‌ల ప‌ని వేళ‌లు ఎక్కువ‌గా ఉంటాయి. ఉద‌యం 5 నుంచి సాయంత్రం 4 గంటల‌ వ‌ర‌కు పాఠ‌శాల కొన‌సాగుతోంది. బాగా చ‌దువుకోవాల‌నుకునే విద్యార్ధులు కొన్నిసార్లు రాత్రి 10-11 గంట‌ల వ‌రకు లైబ్ర‌రీలో కూర్చొని చ‌దువుకొంటారు. మ‌రికొంద‌రు లైబ్ర‌రీలో చ‌దువు పూర్త‌య్యాక రాత్రిపూట నిర్వ‌హించే ప్ర‌త్యేక స్కూల్స్‌లో చేరి, అర్ధ‌రాత్రి దాటి 2 గంట‌ల వ‌ర‌కూ చ‌దువుకోవ‌డం విశేషం. ప్ర‌పంచంలో అత్యుత్త‌మ విద్యావ్య‌వ‌స్ధ ఉన్న దేశాల్లో ద‌క్షిణ కొరియాకు మంచి స్ధాన‌ముంది. ఇక్క‌డి పాఠ‌శాల విద్యార్దులు నూటికి 99 శాతం ఉత్తీర్ణ‌త సాధిస్తుంటారు. విశ్వ‌విద్యాల‌యాల్లో సీటు సంపాదించ‌డం కోసం పాఠ‌శాల స్ధాయిలోనే బాగా క‌ష్ట‌ప‌డి చదువుతుంటారు. జ‌పాన్‌లాగే ఇక్క‌డ కూడా 6+3+3 విద్యా విధానం ఉంటుంది. ఇలాగే మార్చి నుంచి జులై వ‌ర‌కు, సెప్టెంబ‌ర్ నుంచి ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు ఏడాదిలో మొత్తం రెండు సెమిస్ట‌ర్లు ఉంటాయి.


చైనా

అత్య‌ధిక జ‌నాభా గ‌ల చైనాలో పాఠ‌శాల విద్య మూడు భాగాలుగా ఉంటుంది. ప్రీ-స్కూల్ విద్య అనేది మూడేళ్లు, ప్రైమ‌రీ విద్య ఆరేళ్లు, సెకండ‌రీ విద్య ఆరేళ్లు ఉంటుంది. సెకండ‌రీ విద్య‌లో మ‌ళ్లీ రెండు విభాగాలుంటాయి. మూడేళ్ల జూనియ‌ర్ విద్య‌, మూడేళ్ల సీనియ‌ర్ విద్య‌. జూనియ‌ర్ విద్య పూర్త‌య్యాక విద్యార్ధులు ఒక ప్రవేశ ప‌రీక్ష రాయాల్సి ఉంటుంది. దీంట్లో ఉత్తీర్ణ‌త సాధించిన త‌ర్వాత సీనియ‌ర్ విద్య చ‌ద‌వ‌డ‌మో లేదా వొకేష‌న‌ల్ కోర్సులో చేర‌డ‌మో విద్యార్ధులే నిర్ణ‌యించుకుంటారు. సీనియ‌ర్ విద్య‌ను ఎంపిక చేసుకుంటే అది పూర్త‌య్యాక జాతీయ స్ధాయిలో ప్ర‌వేశ ప‌రీక్ష రాసి యూనివ‌ర్సిటీల్లో సీటు ద‌క్కించుకోవాలి. అదే వొకేష‌న‌ల్ కోర్సులో చేరిన‌ట్ల‌యితే 2-4 ఏళ్ల శిక్ష‌ణ అనంత‌రం ఉద్యోగాల్లో చేర‌వచ్చు.


కెన‌డా

అత్య‌ధిక‌మంది విద్యావంతులు యూనివ‌ర్సిటీ నుంచి బ‌య‌టికొచ్చి ఉద్యోగాలు సంపాదించే దేశాల్లో కెన‌డా మొద‌టిస్ధానంలో ఉంటుంది. ఇక్క‌డ విద్యార్ధులు చిన్న‌త‌నం నుంచే బాగా చ‌దువుకోవ‌డానికి అల‌వాటు ప‌డ‌తారు. ఇత‌ర దేశాల నుంచి ఎక్కువ మంది కెన‌డాకు వ‌ల‌స వ‌చ్చిన వాళ్లే ఉంటారు. వారు ఉన్న‌త చ‌దువులు చ‌దివి ఉద్యోగాల నిమిత్తం కెన‌డాకు వ‌చ్చి స్ధిర‌ప‌డ‌తారు కాబ‌ట్టి వారిలాగే వారి పిల్ల‌లు కూడా బాగా చ‌దువుకోవాల‌న్న ఉద్దేశంతో చిన్న‌త‌నం నుంచే విద్య‌పై శ్ర‌ద్ధ పెడతారు. నిజానికి కెన‌డాకు ఒక విద్యా వ్య‌వ‌స్ధ అంటూ ఏమీ లేదు. ప్రాంతాలే స్ధానికంగా విద్యావిధానాన్ని రూపొందించుకుంటాయి. క‌నీసం ప‌ద‌హారేళ్ల విద్య త‌ప్ప‌నిస‌రి.

 

సింగ‌పూర్‌

సింగ‌పూర్ అత్య‌ధిక అక్ష‌రాస్య‌త ఉన్న చిన్న‌ దేశం. ఇక్క‌డ పాఠ‌శాల విద్య మూడు భాగాలుగా ఉంటుంది. మొద‌టి ఆరేళ్లు ప్రైమ‌రీ, త‌ర్వాత నాలుగేళ్లు సెకండ‌రీ, ఆ త‌ద‌నంత‌రం మూడేళ్లు పోస్ట్‌-సెకండ‌రీ విద్య‌ను అభ్య‌సించాల్సి ఉంటుంది. నాలుగేళ్ల ప్రైమ‌రీ విద్య‌ పూర్తికాగానే పాఠ‌శాల‌లే సొంతంగా ప‌రీక్ష నిర్వ‌హిస్తాయి. వీటిలో విద్యార్ధులు ఏ స‌బ్జెక్టులో రాణించ‌గ‌లుగుతున్నారో గుర్తించి, ఆ త‌ర్వాత రెండేళ్ల చ‌దువును కొన‌సాగిస్తారు. సింగ‌పూర్‌లో జాతీయ స్ధాయి విద్యా వ్య‌వ‌స్ద ఉంది.


తల్లిదండ్రులు తమ చిన్నారుల కోసం సరైన విద్యా మార్గాన్ని ఎంచుకునే ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు చిన్ననాటి విద్య యొక్క సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. ప్లేగ్రూప్, నర్సరీ, LKG మరియు UKG వంటి విభిన్న తరగతులతో ప్రీస్కూల్, పిల్లల విద్యా మరియు సామాజిక అభివృద్ధికి పునాది వేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.


ప్లేస్కూల్ / ప్రీ-ప్రైమరీ

ప్రీస్కూల్ విద్యా విధానం ఇల్లు మరియు ప్రాథమిక పాఠశాల మధ్య వారధిగా పనిచేస్తుంది. ప్రీస్కూల్ అనేది ప్రారంభ విద్యా త‌ర‌గ‌తుల మేళ‌వింపు. అంటే ప్లేగ్రూప్‌, న‌ర్స‌రీ, LKG (లోయర్ కిండర్ గార్టెన్), మరియు UKG (అప్పర్ కిండర్ గార్టెన్) అన్నీ ప్రీస్కూల్ త‌ర‌గ‌తుల క్యాట‌గిరీ క్రిందకు వ‌స్తాయి. విద్యను అభ్య‌సించే ప్రారంభ ద‌శ‌లో ప్లేగ్రూప్, న‌ర్స‌రీ విద్యావిదానం ఉంది. ఈ విద్య చాలా చిన్న‌పిల్ల‌ల‌కు అంటే 1.5 నుండి 3 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌స్సు క‌లిగిన పిల్ల‌ల‌కు ఆట‌ల ఆధారంగా నేర్పించే విద్యాభ్యాసం. పిల్ల‌లు అధికారికంగా పాఠ‌శాల విద్యా విధానంలోకి ప్ర‌వేశించే ముందు, పిల్ల‌ల‌కు చిన్న నాటి విద్యను అందించే విద్యా సంస్థ.  పిల్లల అభివృద్ధిలో నర్సరీ టీచర్లు కీలక పాత్ర పోషిస్తారు. ఆటల ద్వారా నేర్చుకోవడాన్ని సులభతరం చేస్తారు మరియు పిల్లల దినచర్యకు అనుగుణంగా సహాయం చేస్తారు. ఈ ప్రీస్కూల్ కార్యకలాపాలు పిల్లలలో స్వయంగా ఆహారం తినడం, దుస్తులు ధరించడం, పరిశుభ్రతను కాపాడుకోవడం మరియు ఇతర ప్రాథమిక లక్షణాలు వంటి అనేక స్వయం సహాయక లక్షణాలను అభివృద్ధి చేయడంలో సహాయపడతాయి. భారతదేశంలో, ప్రీ-ప్రైమరీ విద్యకు సంబంధించిన అనధికారిక ఆదేశాలు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా, పిల్లలు తమ సమయాన్ని 3 నుండి 4 సంవత్సరాల వరకు ప్రీ-ప్రైమరీ పాఠశాలలో గడుపుతారు


నర్సరీ

నర్సరీ సాధారణంగా ప్రారంభ విద్య యొక్క మొదటి అధికారిక సంవత్సరం 3 నుండి 4 సంవత్సరాల వయస్సు గల పిల్లలను లక్ష్యంగా చేసుకుంటుంది. LKG నర్సరీని అనుసరిస్తూ ప్రాథమిక అభ్యాసంపై దృష్టి సారిస్తుంది. అయితే LKGలో అకడమిక్ అంచనాలు క్రమంగా పెరుగుతాయి.


LKG యొక్క పూర్తి రూపం:


LKG పూర్తి రూపం లోయర్ కిండర్ గార్టెన్.

భారతదేశంలోని దాదాపు ప్రతి పిల్లవాడు విద్యలో మొదటి మెట్టుగా ఎల్‌కెజి చదువుతున్నాడు. భారతదేశంలో ప్రాథమిక విద్యలో ప్రవేశించడానికి ప్రతి బిడ్డకు తప్పనిసరి విద్య యొక్క మొదటి రెండు భాగాలు LKG మరియు UKG.

LKG ప్రవేశానికి చాలా పాఠశాలల్లో వయోపరిమితి 3 సంవత్సరాలు. పిల్లలు ఎల్‌కెజిలో పద్యాలు, నృత్యం, అక్షరాలు మొదలైనవి నేర్చుకుంటారు. చాలా పాఠశాలలు వర్ణమాల యొక్క మౌఖిక ఉచ్చారణను మాత్రమే బోధిస్తాయి. అయితే, కొన్ని పాఠశాలలు వారికి పెన్సిల్ పట్టుకుని సరళ రేఖలు మరియు స్లీపింగ్ లైన్‌లను గీయడం నేర్పుతాయి. ఇది పిల్లలు వర్ణమాలలను చాలా స్పష్టంగా మరియు సులభంగా వ్రాయడానికి సహాయపడుతుంది.


LKGలో, పిల్లలు పెన్సిల్‌లను పట్టుకునే పద్ధతిని నేర్చుకుంటారు మరియు అభ్యాసం ద్వారా, రాసే సాధనాలను పట్టుకోవడం కోసం వారి మోటారు నైపుణ్యాలపై కొంత నియంత్రణను పొందుతారు. ప్రతి పిల్లవాడు ఎలా వ్రాయాలో నేర్చుకోవడానికి వేర్వేరు సమయాన్ని తీసుకుంటాడు. ఈ దశలో ప్రతి బిడ్డ పురోగతి చాలా నెమ్మదిగా ఉంటుంది మరియు ఇది ఎగువ కిండర్ గార్టెన్‌లో కూడా కొనసాగుతుంది.


UKG/PP2 (ప్రీ-ప్రైమరీ-2) విద్యార్థి కోసం తరగతి సామాజిక ప్రవర్తనతో ప్రారంభమవుతుంది.

ఉదాహరణకు: ఉపాధ్యాయులను కోరుకోవడం, సరిగ్గా కూర్చోవడం మరియు సరైన ప్రదర్శనలతో వస్తువులను చూసుకోవడం.


అంగ‌న్‌వాడీ స్సూల్స్‌

భార‌తదేశంలోని బాల బాలిక‌ల‌కు, వారికి పౌష్టికాహారం అందించాల‌న్న ఉద్దేశంతో భార‌త ప్ర‌భుత్వము అంగ‌న్‌వాడీ కేంద్రాల వ్య‌వ‌స్ధ‌ను ప్రవేశ పెట్టింది. 3 సంవ‌త్స‌రాల నుండి 5 సంవ‌త్స‌రాల వ‌య‌సు ఉన్ పి్ల‌ల‌కు ప్రీ-స్కూల్ విద్య‌ను అందించే దిశ‌గా ప‌నిచేస్తాయి.


బాల‌వాటిక‌

ప్రస్తుతం భారతదేశంలో ప్రాథమిక విద్య తప్పనిసరి. భార‌త‌దేశంలో ప్రీ-ప్రైమరీ తప్పనిసరి కాదు, అయితే, ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. భవిష్యత్తులో ఉన్నత తరగతులకు పిల్లలను సిద్ధం అయ్యేలా చేస్తుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలలు మరియు అనుబంధ ప్రైవేట్ పాఠశాలలు 30 మే నాటికి 5 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలను ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతికి నమోదు చేసుకోవడానికి అనుమతిస్తాయి.

ఈ న‌ర్స‌రీ, LKG, UKG విద్య‌ను ఉచితంగా పొందాలంటే కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన కేంద్రీయ విద్యాల‌యాల్లో నూత‌నంగా బాల‌వాటిక విధానాన్ని తీసుకొచ్చింది. కేంద్ర‌ప్ర‌భుత్వం ఎంపిక చేసిన కేంద్రీయ విద్యాల‌యాల్లోని బాల‌వాటిక I/II/III కింద ప్రీప్రైమ‌రీ త‌ర‌గ‌తుల్లో విద్య‌ను అందిస్తున్నారు. బాల‌వాటిక‌ల్లో ప్ర‌వేశాల‌కు కేవీల్లో ఒక‌టో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల షెడ్యూల్‌తోపాటు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తారు. ఎంపిక చేసిన 50 కేవీల్లో బాల‌వాటిక‌-1లో, 445 కేవీల్లో బాల‌వాటిక‌-3 త‌ర‌గ‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. బాల‌వాటిక -2,3 ల్లో ప్ర‌వేశాల‌ను సీట్ల ఖాళీల‌ను బ‌ట్టి భ‌ర్తీ చేస్తారు. బాల‌వాటిక -1 లో చేరే పిల్ల‌ల‌కు వ‌య‌సు 3 నుండి 4 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌న‌, అలాగే బాల‌వాటిక -2 లో చేరే పిల్ల‌ల‌కు వ‌య‌సు 4 నుండి 5 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌లో, బాల‌వాటిక -3లో చేరే పిల్ల‌ల‌కు 5 నుండి 6 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు ఉండాలి. ఈ అడ్మిష‌న్స్ కోసం ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాలి.


తీర్మానం

పిల్లల విద్య ప్రయాణంలో, LKG, UKG మరియు నర్సరీల మధ్య తేడాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనది. పిల్లల మేధో మరియు మానసిక ఎదుగుదలను పెంపొందించడంలో ప్రతి దశ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ప్రతి స్థాయిలో ఏమి ఆశించాలో తెలుసుకోవడం ద్వారా, తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా ప్రయాణం కోసం సమాచారంతో కూడిన ఎంపికలను చేయవచ్చు.


Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD